పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : భద్ర లక్షణల పరిణయంబు

  •  
  •  
  •  

10.2-147-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రులఁ బాఱఁదోలి భుజ గాంతకుఁడైన ఖగేశ్వరుండు ము
న్నమృతముఁ దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా
లదళాయతేక్షణుఁడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్
దమృగేక్షణన్ నయవిక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్.

టీకా:

అమరులన్ = దేవతలను; పాఱదోలి = తరిమి వేసి; భుజగ = సర్పములకు {భుజగాంతకుడు - సర్పముల పాలిటి యముడు, గరుత్మంతుడు}; అంతకుడు = యముడు; ఐన = అయిన; ఖగేశ్వరుండు = గరుత్మంతుడు {ఖగేశ్వరుడు -ఖగము (పక్షు)లకు ఈశ్వరుడు, గరుత్మంతుడు}; మున్ను = పూర్వము; అమృతమున్ = అమృతమును; తెచ్చు = తీసుకు వచ్చిన; కైవడిని = విధముగా; మద = చెడ్డ గర్వముచేత; అంధులు = కానరానివారైన; రాజులన్ = రాజులను {రాజు - రంజయంతి రాజః, రంజింపజేయువాడు, రాజు}; ఉక్కు = మదము; అడంచి = అణచివేసి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; కమలదళాయతేక్షణుడు = కృష్ణుడు {కమలదళాయతేక్షణుడు - కమల (తామర) దళ (రేకులవంటి) ఆయత (విశాలమైన) ఈక్షణుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; కైకొని = చేపట్టి; తెచ్చెను = తీసుకు వచ్చెను; మద్ర = మద్రదేశ రాజు యొక్క; కన్యకన్ = కూతురును; సమద = మదించిన; మృగ = లేడివంటి; ఈక్షణన్ = కన్నులు కలామెను; నయ = నీతి యందు; విచక్షణన్ = వివేచన కలామెను; లక్షణన్ = లక్షణ అను నామెను; పుణ్య = శుభకరమైన; లక్షణన్ = లక్షణములు కలామెను.

భావము:

అంతేకాక పూర్వం గరుత్మంతుడు దేవతలను పారదోలి, అమృతం తెచ్చిన విధంగా మదాంధులైన రాజులను ఓడించి, శ్రీకృష్ణుడు లేడికన్నుల వంటి కన్నులు కల సుందరీ, మద్రరాజుకుమార్తీ, శుభలక్షణవతీ అయిన లక్షణను పరిగ్రహించాడు.