పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నాగ్నజితి పరిణయంబు

  •  
  •  
  •  

10.2-143-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దండి నరాతు లెల్ల హరిఁ దాఁకిన నడ్డము వచ్చి వీఁకతో
భంన భూమియందుఁ దన బాంధవులెల్లను సన్నుతింపఁగా
గాండివచాపముక్త విశిఖంబుల వైరుల నెల్లఁ జంపె నా
ఖంలనందనుండు శశకంబుల సింహము చంపుకైవడిన్.

టీకా:

దండిన్ = పరాక్రమముతో; ఆరాతులు = శత్రువులు; ఎల్లన్ = అందరు; హరిన్ = కృష్ణుని; తాకినన్ = ఎదిరించగా; అడ్డమువచ్చి = అడ్డమువచ్చి; వీక = పరాక్రమము; తోన్ = తోటి; భండన = యుద్ధ; భూమి = భూమి; అందున్ = లో; తన = అతని; బాంధవులు = బంధువులు; ఎల్లన్ = అందరు; సన్నుతింపన్ = స్తుతించగా; గాండివ = గాండివము అను {గాండివము - అర్జునుని ధనుస్సు పేరు}; చాప = విటినుండి; ముక్త = విడువబడిన; విశిఖంబులన్ = బాణములతో; వైరులన్ = శత్రువులను; ఎల్లన్ = అందరిని; చంపెన్ = చంపెను; ఆఖండలనందనుండు = అర్జునుడు {ఆఖండల నందనుడు - ఆఖండలుడు (పర్వతములను ఖండించినవాడు, ఇంద్రుడు) యొక్క నందనుడు, అర్జునుడు}; శశకంబులన్ = కుందేళ్ళను; సింహము = సింహము; చంపు = చంపు; కైవడిన్ = విధమున.

భావము:

రాజులు అందరూ కలిసి శ్రీకృష్ణుడి పైకి రాగా, అర్జునుడు పరాక్రమంతో ఎదుర్కొన్నాడు గాండీవంనుండి వదలిన బాణాలతో సింహం కుందేళ్ళను సంహరించునట్లు శత్రువులను అందరినీ హతమార్చాడు. బంధువులంతా ఎంతో సంతోషించారు.