పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నాగ్నజితి పరిణయంబు

  •  
  •  
  •  

10.2-142-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూతి యెలర్పఁ గోసలుని పుత్త్రికకై చనుదెంచి తొల్లి యాఁ
బోతులచేత నోటువడి పోయిన భూపతులెల్ల మాధువుం
డా రుణిన్ వరించుట చరావలిచే విని త్రోవ సైన్య సం
ఘాముతోడఁ దాఁకి రరిర్వవిమోచనుఁ బద్మలోచనున్.

టీకా:

భూతి = వైభవము; ఎలర్పన్ = అతిశయింపగా; కోసలుని = నగ్నజిత్తు యొక్క; పుత్రిక = కూతురు; కై = కోసము; చనుదెంచి = వచ్చి; తొల్లి = ముందు; ఆబోతుల = ఆంబోతుల; చేతన్ = చేత; ఓటుపడిపోయిన = ఓడిపోయిన; భూపతులు = రాజులు; ఎల్లన్ = అందరు; మాధవుండు = కృష్ణుడు; ఆ = ఆ యొక్క; తరుణిన్ = యువతిని {తరుణి - తరుణ వయస్కురాలు, స్త్రీ}; వరించుటన్ = పెండ్లాడుట; చర = చారుల; అవలి = సమూహము; చేన్ = వలన; విని = విని; త్రోవన్ = దారిలో; సైన్య = సేనా; సంఘాతము = సమూహము; తోడన్ = తోటి; తాకిరి = ఎదిరించిరి; అరి = శత్రువుల; గర్వ = గర్వమును; విమోచనున్ = తొలగించువానిని; పద్మలోచనున్ = పద్మాక్షుని, కృష్ణుని.

భావము:

ఇంతకుపూర్వం నాగ్నజితిని వివాహం చేసుకుందా మని వచ్చి ఆబోతులను ఓడించలేక పరాజితులైన రాజులు అందరూ, మాధవుడు ఆ కన్యను వివాహ మాడిన విషయం గూఢచారుల వలన తెలుసుకుని శత్రువుల గర్వం భంజించే శ్రీకృష్ణుడిని జయించడానికి సైన్యసమేతంగా వచ్చి మార్గమధ్యంలో అడ్డగించారు.