పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నాగ్నజితి పరిణయంబు

  •  
  •  
  •  

10.2-136-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చంద్గోవృషసప్తకంబుఁ గడిమిన్ సైరించి యెవ్వాఁడు భం
జించున్ వానికిఁ గూఁతు నిత్తు నని యేఁ జీరించినన్ వైభవో
దంద్గర్వులు వచ్చి రాజతనయుల్‌ త్పాద శృంగాహతిం
గించిత్కాలము నోర్వ కేగుదు రనిం గేడించి భిన్నాంగులై.

టీకా:

చంచత్ = తిరుగుచున్న; గోవృష = ఆబోతులు; సప్తకంబున్ = ఏడింటిని (7); కడిమిన్ = పరాక్రమముతో; సైరించి = తట్టుకొని; ఎవ్వాడు = ఎవరైతే; భంజించున్ = శిక్షించునో; వాని = అతని; కిన్ = కి; కూతున్ = పుత్రికను; ఇత్తును = ఇచ్చెదను; అని = అని; ఏన్ = నేను; చీరించినన్ = పిలిపించగా; వైభవ = ఐశ్వర్యము; ఉదంచత్ = అతిశయముచేత; గర్వులు = గర్వము కలవారు; వచ్చి = చేరి; రాజతనయుల్ = రాకుమారులు; తత్ = వాటి; పాద = కాళ్ళ యొక్క; శృంగ = కొమ్ముల యొక్క; హతిన్ = తాకిడులను, దెబ్బలను; కించిత్ = కొద్ది; కాలమున్ = సమయమేనా; ఓర్వక = తట్టుకొనలేక; ఏగుదురు = పోవుచున్నారు; అనిన్ = పోరునకు; కేడించి = వెనుదీసి; భిన్న = విరిగిన; అంగులు = అవయవములు కలవారు; ఐ = అయ్యి.

భావము:

ఆ ఏడువృషభాలను బాహుబలంతో ఎదుర్కుని ఎవడు జయిస్తాడో? అతనికి నా కుమార్తెను ఇచ్చి వివాహం జరుపుతానని చాటించాను. గర్విష్టులైన రాజులెందరో వచ్చి ఆంబోతులగిట్టల దెబ్బలకు కొంచంసేపు కూడా తట్టుకోలేక ఛిన్నాభిన్నా మైన శరీరాలతో పోటీ నుండి తప్పుకున్నారు.