పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నాగ్నజితి పరిణయంబు

  •  
  •  
  •  

10.2-135-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్యం జేకొన నిన్నిలోకముల నీ న్నన్ ఘనుండైన రా
న్యుం డెవ్వఁడు? నీ గుణంబులకు నాశ్చర్యంబునుం బొంది తా
న్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిత్యయై
న్యత్వంబునుఁ జెంది యున్నది గదా తాత్పర్యసంయుక్తయై.

టీకా:

కన్యన్ = కుమారిని; చేకొనన్ = పెండ్లాడుటకు; ఇన్ని = ఈ అన్ని; లోకములన్ = లోకములలోను; నీ = నీ; కన్నన్ = కంటెను; ఘనుండు = గొప్పవాడు; ఐన = అయిన; రాజు = రాజు; అన్యుండు = ఇతరుడు; ఎవ్వడు = ఎవరు; నీ = నీ యొక్క; గుణంబుల్ = గొప్పగుణముల; కున్ = కు; ఆశ్చర్యంబునున్ = అద్భుతమును; పొంది = పొంది; తాన్ = తాను; అన్య = ఇతర; ఆరంభంబు = ప్రయత్నములు; మాని = విడిచి; లక్ష్మి = లక్ష్మీదేవి; భవదీయ = నీ యొక్క; అంగంబునన్ = దేహము నందు; నిత్య = నిలుకడగా ఉండునది; ఐ = అయ్యి; ధన్యత్వంబునున్ = కృతార్థత; చెంది = చెంది; ఉన్నది = ఉన్నది; కదా = కదా; తాత్పర్య = తత్పరత్వముతో; సంయుక్త = కూడుకొన్నది; యై = అయ్యి.

భావము:

“నా కుమార్తెను వివాహమాడడానికి ఈ లోకాలు అన్నిటిలో, నీకంటే తగిన వాడెవడు? నీ సద్గుణాలకు మెచ్చి వరించి లక్ష్మీదేవి, ఇతరులను కాదని, నీ వక్షస్థలంలో శాశ్వత స్థానం సంపాదించుకుని ధన్యురాలైంది.