పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అర్జునితో మృగయావినోదంబు

  •  
  •  
  •  

10.2-123-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వావసూనుచేఁ దనకు హ్నిశిఖాజనితోగ్రవేదనల్
పాసినఁ జేసి యొక్క సభ పార్థున కిచ్చె మయుండు ప్రీతుఁడై
యా భలోనఁ గాదె గమనాగమనంబులఁ గౌరవేంద్రుఁ డు
ల్లాముఁ బాసి యుండుట జస్థలనిర్ణయ బుద్ధి హీనుఁడై.

టీకా:

వాసవసూను = అర్జునుని {వాసవసూనుడు - ఇంద్రుని కొడుకు, అర్జునుడు}; చేన్ = వలన; తన = అతని; కున్ = కి; వహ్ని = అగ్ని; శిఖా = మంటలచేత; జనిత = కలిగెడి; ఉగ్ర = భయంకరమైన; వేదనల్ = బాధలు; పాసినన్ = తొలగుట; చేసి = వలన; ఒక్క = ఒకానొక; సభన్ = సభామండపమును; పార్థున్ = అర్జునుని; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; మయుండు = మయుడు; ప్రీతుడు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; సభ = సభామండపము; లోనన్ = అందునే; కాదే = కాదా; గమన = పోక; ఆగమనంబులన్ = రాకలలో; కౌరవేంద్రుడు = దుర్యోధనుడు; ఉల్లాసమున్ = ఉత్సాహము; పాసి = విడిచి; ఉండుట = అగుట జరిగెను; జలస్థల = నీళ్ళుండు ప్రదేశము; నిర్ణయ = అవునో కాదో తెలిసెడి; బుద్ధి = ఙ్ఞానము; హీనుడు = లేనివాడు; ఐ = అయ్యి.

భావము:

ఖాండవ వన దహన సమయంలో, అగ్నిజ్వాలల బాధనుండి తప్పించి ఇంద్రుడి పుత్రుడు అర్జునుడు తనను రక్షించినందు వలన, మయుడు సంతోషంతో ఒక మహాసభను నిర్మించి ఆ కుంతీపుత్రుడైన అర్జునుడికి బహుకరించాడు. ఆ సభ లోనే దుర్యోధనుడు సంచరిస్తూ గచ్చుకీ, జలాశయానికీ తేడా తెలియక అవమానం పొందాడు.