పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అర్జునితో మృగయావినోదంబు

  •  
  •  
  •  

10.2-122-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నర నారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవవనంబు దహించిన సంతసించి విజయునకు నక్షయ తూణీరంబులు, నభేద్యకవచంబును, గాండీవమనియెడి బాణాసనంబును దివ్యరథంబును ధవళరథ్యంబులను నిచ్చె నందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; నరనారాయణులు = కృష్ణార్జునులు; సహాయులు = తోడుపడినవారు; కాన్ = కాగా; దహనుండు = అగ్నిదేవుడు {దహనుడు - దహింపజేయు వాడు, అగ్ని}; ఖాండవ = ఖాండవము అను; వనంబున్ = వనమును; దహించినన్ = కాల్చివేయగా; సంతసించి = సంతోషించి; విజయున్ = అర్జునుని; కున్ = కి; అక్షయ = తరుగని; తూణీరంబులున్ = బాణములు గల పొదులు; అభేద్య = భేదింపరాని; కవచంబును = కవచమును; గాండీవము = గాండీవము; అనియెడి = అనెడి; బాణాసనంబును = విల్లును; దివ్య = మహిమాన్వితమైన; రథంబును = రథమును; ధవళ = తెల్లని; రథ్యంబులను = గుఱ్ఱములను; ఇచ్చెన్ = ఇచ్చెను; అందున్ = అప్పుడు.

భావము:

నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించి, సంతోషించి అర్జునుడికి అక్షయ తూణీరాలు, భేదించడానికి వీలు లేని కవచం, గాండీవ మనే ధనుస్సు, దివ్యమైన రథమూ, తెల్లని గుఱ్ఱాలు అనుగ్రహించాడు.