పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అర్జునితో మృగయావినోదంబు

  •  
  •  
  •  

10.2-121-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవేంద్రుని ఖాండవ మ
ప్పాకునకు నీఁ దలంచి పార్థుని రథికుం
గావించి సూతుఁ డయ్యెను
గోవిందుఁడు మఱఁదితోడఁ గూరిమి వెలయన్.
^ ఖాండవ వన దహనం – మహాభారత కథ

టీకా:

దేవేంద్రుని = దేవేంద్రుడి యొక్క; ఖాండవమున్ = ఖాండవవనమును; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పావకున్ = అగ్నిదేవుని {పావకుడు - పవిత్రము చేయువాడు, అగ్ని}; ఈన్ = ఇవ్వవలెనని; తలంచి = భావించి; పార్థుని = అర్జునుని; రథికున్ = రథము నందలి యోధునిగా; కావించి = చేసి; సూతుడు = సారథి; అయ్యెను = అయ్యెను; గోవిందుడు = కృష్ణుడు; మఱిది = మేనత్తకొడుకు (అర్జునుని); తోడన్ = తోటి; కూరిమి = మైత్రి; వెలయన్ = ప్రకాశించగా.

భావము:

దేవేంద్రుని ఖాండవవనాన్ని అగ్నిదేవుడికి అర్పించడానికి నిశ్చయించుకుని మేనత్త కొడుకు అర్జునుడిని సస్నేహంగా పిలిచి, అతని రథానికి శ్రీకృష్ణుడు తాను సారథి అయ్యాడు.