పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అర్జునితో మృగయావినోదంబు

  •  
  •  
  •  

10.2-115-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గతు లైన యట్టి పురుషోత్తమ పార్థులు గాంచి రాపగా
విపుల విలోల నీలతర వీచికలందు శిరోజభార రు
చ్యహసితాళిమాలిక నుదంచిత బాల శశిప్రభాలికం
నుని బాలికన్ మదనర్పణతుల్య కపోలపాలికన్.

టీకా:

ఉపగతులు = దగ్గర దగ్గరగా ఉన్న వారు; ఐనయట్టి = అగు; పురుషోత్తమ = కృష్ణుడు {పురుషోత్తముడు - పురుషుడైన (జగత్తుకు కారణభూతుడైన) శ్రేష్ఠుడు, విష్ణువు}; పార్థులున్ = అర్జునులు {పార్థుడు - పృథ (కుంతి) యొక్క పుత్రుడు, అర్జునుడు}; కాంచిరి = చూసిరి; ఆపగా = నదిలో; విపుల = విరివి అయిన; విలోల = మిక్కిలి చలించుచున్న; నీలతర = మిక్కిలి నల్లనైన; వీచికలు = అలలు; అందున్ = లో; శిరోజ = తలవెంట్రుకల; భార = ముడి యొక్క; రుచి = కాంతులచేత; అపహసిత = ఎగతాళిచేయబడిన; అళీ = తుమ్మెదల; మాలికన్ = సమూహము కలామెను; ఉదంచిత = మిక్కిలి చక్కటి; బాలశశి = లేతచంద్రుని; ప్రభా = ప్రకాశము కల; అలికన్ = నొసలు కలామెను; తపనుని = సూర్యుని {తపనుడు - తపింపజేయు వాడు, సూర్యుడు}; బాలికన్ = కుమార్తెను; మదన = మన్మథుని; దర్పణ = అద్దముతోటి; తుల్య = సమానమైన; కపోల = చెక్కిటి; పాలికన్ = పాలి (ప్రదేశము) కలామెను.

భావము:

కృష్మార్జునులు అలా యమున ఇసుకతిన్నెలపై కూర్చుని ఉన్నప్పుడు, ఆ నదీతరంగాలలో తుమ్మెదల సమూహాన్ని ధిక్కరించే శిరోజశోభతో, బాలచంద్రుడిని బోలిన నెన్నుదురుతో, అద్దాలవంటి చెక్కిళ్ళతో ప్రకాశించే, సూర్యుని కుమార్తెను చూసారు.