పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ఇంద్రప్రస్థంబున కరుగుట

  •  
  •  
  •  

10.2-104-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చంద్ఘనకుచభారా
కుంచితయై క్రొత్త పెండ్లికూఁతు రగుట నిం
చించుక సిగ్గు జనింపఁగఁ
బాంచాలతనూజ మ్రొక్కెఁ ద్మాక్షునకున్.

టీకా:

చంచత్ = చలించుచున్న; ఘన = పెద్ద; కుచ = స్థనముల; భార = బరువుచేత; ఆకుంచిత = మిక్కిలి వంపబడినది; ఐ = అయ్యి; క్రొత్త = కొత్తగా; పెండ్లికూతురు = పెళ్ళయిన ఇల్లాలు; అగుటన్ = అగుటచేత; ఇంచించుక = కొంచెము; సిగ్గు = సిగ్గు; జనింపగన్ = పడుతుండగా; పాంచాలతనూజ = కృష్ణ {పాంచాల తనూజ - పాంచాలదేశము నేలెడి ద్రుపదమహారాజు కుమార్తె, ద్రౌపది}; మ్రొక్కెన్ = నమస్కరించెను; పద్మాక్షున్ = కృష్ణున; కున్ = కు.

భావము:

స్తనభారంతో అవనత అయి, క్రొత్త పెళ్ళికూతురు కావడం చేత సిగ్గుపడుతూ పాంచాలరాజపుత్రి ద్రౌపది పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడికి నమస్కరించింది.