పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శతధన్వుని ద్రుంచుట

  •  
  •  
  •  

10.2-92.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్ఘ్యపాద్యాది కృత్యంబు లాచరించి
యిచ్చగించిన వస్తువు లెల్ల నిచ్చి
యుండు మని భక్తి చేసిన నుండె ముసలి;
కువలయేశ్వర! మిథిలలోఁ గొన్ని యేండ్లు.

టీకా:

ఆ = ఆ ప్రసిద్ధమైన; మణిన్ = రత్నమును; శతధన్వుడు = శతధన్వుడు; అపహరించుట = దొంగతనము చేయుట; నిక్కము = నిజము; ఎవ్వరి = ఎవరి; చేన్ = చేతికి; దాపన్ = దాచుటకు; ఇచ్చినాడొ = ఇచ్చెనో; వేగమె = శీఘ్రమే; నీవు = నీవు; ఏగి = వెళ్ళి; వెదకుము = అన్వేషించుము; పురి = పట్టణము; లోనన్ = లోపల; వైదేహున్ = జనకరాజుని {వైదేహుడు - విదేహరాజ్యమునకు ప్రభువు, జనకుడు}; దర్శింపన్ = చూడవలెనని; వాంఛ = కోరిక; కలదు = కలిగినది; పోయి = వెళ్ళి; వచ్చెదన్ = వస్తాను; నీవు = నీవు; పొమ్ము = వెళ్ళు; అని = అని; వీడ్కొని = సెలవిచ్చి; మెల్లనన్ = తిన్నగా; రాముండు = బలరాముడు; మిథిలన్ = మిథిలానగరమును {మిథిలానగరము - విదేహరాజ్య ముఖ్యపట్టణము}; చొచ్చి = లోనికి ప్రవేశించి; పోయినన్ = వెళ్ళగా; జనకుండు = జనకుడు; పొడగని = చూసి; హర్షించి = సంతోషించి; ఎంతయున్ = మిక్కిల; ప్రియము = ఇష్టము; తోన్ = తోటి; ఎదురు = ఎదురుగా; వచ్చి = వచ్చి; అర్ఘ్య = అర్ఘ్యమిచ్చుట {అర్ఘ్యము - పూజకొఱకైనది, అష్టార్ఘ్యములు - 1పెరుగు 2తేనె 3నెయ్యి 4అక్షతలు 5గఱిక 6నువ్వులు 7దర్భలు 8పుష్పము అను పూజకొరకైనది}; పాద్య = పాద్యమిచ్చుట {పాద్యము - కాళ్ళు కొరకైనది, జలాదికము}; ఆది = మున్నగు; కృత్యంబులు = పనులు; ఆచరించి = చేసి; ఇచ్చగించిన = కోరిన; వస్తువులు = పదార్థములు; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చి = ఇచ్చి; ఉండుము = ఇక్కడ ఉండుము; అని = అని; భక్తిన్ = సేవించుట; చేసినన్ = చేయగా; ఉండెన్ = ఉండెను; ముసలి = బలరాముడు {ముసలి - ముసలము ఆయుధముగా కలవాడు, బలరాముడు}; కువలయేశ్వర = రాజా {కువలయేశ్వరుడు - కువలయము (భూమండలము)నకు ఈశ్వరుడు, రాజు}; మిథిల = మిథిలానగరమున; కొన్ని = కొన్ని; ఏండ్లు = సంవత్సరములు.

భావము:

“శమంతకమణిని శతధన్వుడు అపహరించడం నిజం. ఎవరికి దాచిపెట్టమని ఇచ్చాడో? ఏమిటో? నీవు వెంటనే ద్వారకకు వెళ్ళి మణి కోసం అన్వేషించు. నాకు విదేహ దేశ ప్రభువు అయిన జనకుడిని చూడాలనే కోరిక కలిగింది. నేను వెళ్ళివస్తాను. నీవు ద్వారకకు వెళ్ళు.” అని చెప్పి, శ్రీకృష్ణుడిని పంపించి, మిథిలానగరమునకు వెళ్ళాడు. బలరాముడికి జనకమహారాజు ఆర్ఘ్యపాద్యాది విధులతో సత్కారాలు చేసి అభీష్ట వస్తువులను ఇచ్చి అక్కడ ఉండమని ప్రార్థించాడు. బలరాముడు కొన్ని ఏళ్ళు మిథిలానగరంలో ఉన్నాడు.