పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శతధన్వుఁడు మణి గొనిపోవుట

  •  
  •  
  •  

10.2-84-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గతీశ! విన వయ్య తధన్వుఁ బొడగని-
క్రూర కృతవర్మ లాప్తవృత్తి
"న కిత్తు ననుచు సమ్మతిఁ జేసి తన కూఁతుఁ-
ద్మాక్షునకు నిచ్చి పాడి దప్పె
లుఁడు సత్రాజిత్తుఁ, లయ కే క్రియ నైన-
ణిపుచ్చుకొనుము నీతము మెఱసి"
ని తన్నుఁ బ్రేరేఁప నా శతధన్వుఁడు-
శువుఁ గటికివాఁడు ట్టి చంపు

10.2-84.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రణి నిదురవోవఁ డఁగి సత్రాజిత్తుఁ
ట్టి చంపి, వాని భామ లెల్ల
మొఱలువెట్ట లోభమునఁ జేసి మణి గొంచుఁ
నియె నొక్క నాఁడు నవరేణ్య!

టీకా:

జగతీశ = రాజా {జగతీశుడు - రాజ్యమునకు ఈశుడు, ప్రభువు}; వినవు = వినుము; అయ్య = తండ్రి; శతధన్వున్ = శతధన్వుని; పొడగని = చూసి; అక్రూర = అక్రూరుడు; కృతవర్మలు = కృతవర్మలు; ఆప్తవృత్తిన్ = ఆప్తులవలె; మన = మన; కిన్ = కి; ఇత్తును = ఇచ్చెదను; అనుచున్ = అని; సమ్మతిజేసి = ఒప్పుకొని; తన = అతని; కూతున్ = పుత్రికను; పద్మాక్షున్ = కృష్ణుని; కున్ = కి; ఇచ్చి = ఇచ్చి; పాడి = న్యాయము; తప్పెన్ = తప్పెను; ఖలుడు = దుష్టుడు; సత్రాజిత్తుడు = సత్రాజిత్తు; అలయక = ఆలస్యము చేయకుండ; ఏ = ఏ; క్రియన్ = విధముగా; ఐనన్ = అయినప్పటికి; మణిన్ = రత్నమును; పుచ్చుకొనుము = తీసుకొనుము; నీ = నీ యొక్క; మతము = పద్ధతి; మెఱసి = ప్రకాశింపజేసి; అని = అని; తన్నున్ = తనను; ప్రేరేపన్ = పురిగొల్పగా; ఆ = ఆ యొక్క; శతధన్వుడు = శతధన్వుడు; పశువున్ = జంతువును; కటికివాడు = కసాయివాడు; పట్టి = పట్టుకొని; చంపు = చంపెడి; కరణిన్ = విధముగ; నిదురపోవన్ = నిద్రపోవుచుండగా; కడగి = పూని; సత్రాజిత్తున్ = సత్రాజిత్తును; పట్టి = పట్టుకొని; చంపి = చంపి; వాని = అతని; భామలు = స్త్రీలు; ఎల్లన్ = అందరు; మొఱలుపెట్టన్ = ఆక్రందనులు చేయుచుండ; లోభమునన్ = లుబ్ధత్వము; చేసి = వలన; మణిన్ = రత్నమును; కొంచున్ = తీసుకొనుచు; చనియెన్ = వెళ్ళిపోయెను; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; జనవరేణ్య = రాజా {జనవరేణ్యుడు - జనులలో ముఖ్యుడు, రాజు}.

భావము:

ఓ పరీక్షన్నరేంద్రా! అక్రూరుడూ, కృతవర్మా, శతధన్వుడిని కలిసి “దురామార్గుడైన సత్రాజిత్తు సత్యభామను మనకు ఇస్తానని చెప్పి, శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసి మాట తప్పాడు. నీవు ఏదో విధంగా శమంతకమణిని గ్రహించు” అని ప్రేమ ఒలకబోస్తూ ప్రేరేపించారు. శతధన్వుడు కసాయివాడు పశువును పట్టుకుని చంపినట్లుగా, నిద్రపోతున్న సత్రాజిత్తును బలవంతంగా చంపివేశాడు. సత్రాజిత్తు భార్యలు రోదిస్తుండగా లోభంతో మణిని తీసుకుపోయాడు.