పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సత్యభామా పరిణయంబు

  •  
  •  
  •  

10.2-82-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మణి యిచ్చినాఁడు వాసర
ణి నీకును; మాకుఁ గలవు ణులు; కుమారీ
ణి చాలు నంచుఁ గృష్ణుఁడు
ణి సత్రాజిత్తునకును రలఁగ నిచ్చెన్. "

టీకా:

మణిన్ = రత్నమును; ఇచ్చినాడు = ఇచ్చాడు; వాసరమణి = సూర్యుడు {వాసర మణి - వాసర (దినమునకు) మణి, సూర్యుడు}; నీ = నీ; కును = కు; మా = మా; కున్ = కు; కలవు = ఉన్నాయి; మణులు = రత్నాలు; కుమారీ = కన్యకా; మణి = ఉత్తమురాలు; చాలున్ = చాలును; అంచున్ = అని; కృష్ణుడు = కృష్ణుడు; మణిన్ = రత్నమును; సత్రాజిత్తున్ = సత్రాజిత్తున; కున్ = కు; మరల = మరలగ, తిరిగి; ఇచ్చెన్ = ఇచ్చివేసెను.

భావము:

“ఈ శమంతకమణిని సూర్యభగవానుడు నీకు ప్రసాదించాడు. మాకు మణులకు కొదువ లేదు. ఈ కన్యామణి చాలు” అని శ్రీకృష్ణుడు శమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేశాడు.