పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికా వస్త్రాపహరణము

  •  
  •  
  •  

10.1-826-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన కన్నియల పలుకు లాలించి మందహాస సుందర వదనారవిందుండై గోపాలబాలకులకరంబులం గరంబులు వ్రేసి య మ్ముద్దియల నుద్దేశించి నెఱవాది చతురుం డిట్లనియె.

టీకా:

అని = అని; పలికిన = చెప్పిన; కన్నియల = కన్నెపిల్లల; పలుకులున్ = మాటలను; ఆలించి = విని; మందహాస = చిరునవ్వుగల; సుందర = అందమైన; వదన = మోము అనెడి; అరవిందుడు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; గోపాల = గొల్ల; బాలకుల = పిల్లల; కరంబులన్ = చేతులలో; కరంబులున్ = చేతులు; వ్రేసి = వేసి; ఆ = ఆ యొక్క; ముద్దియలన్ = ముగ్ధల; ఉద్దేశించి = తో; నెఱవాది = చక్కగా మాట్లాడువాడు; చతురుండు = నేర్పరి, కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా గోపికలు అంటున్న మాటలు శ్రీకృష్ణుడు విన్నాడు. ఆయన ముఖపద్మం ముసిముసి నవ్వులతో చక్కగా అయింది. తోటి గొల్లపిల్లల చేతులతో చేతులు కలిపినెరజాణలలో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ వనితలతో ఇలా అన్నాడు.