పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికా వస్త్రాపహరణము

  •  
  •  
  •  

10.1-825-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజుల నెఱుఁగవు బలిమిని
రాజిల్లెదు చీర లీవు మణుల మింకన్
రాజున కెఱిఁగించెద; మో
రాజీవదళాక్ష! నీవు రాజవె ధరకున్? "

టీకా:

రాజులన్ = నిను శిక్షించ గలవారిని; ఎఱుగవు = ఎవరులేరు; బలిమినిన్ = స్వశక్తిచేత; రాజిల్లెదు = ప్రకాశించెదవు; చీరలు = వస్త్రములు; ఈవు = ఇయ్యవు; రమణులము = స్త్రీలము మేమందరము; ఇంకన్ = మరి; రాజున్ = ఈదేశ పాలకున; కున్ = కు; ఎఱిగించెదము = తెలిపెదము; ఓ = ఓయీ; రాజీవదళాక్షా = కృష్ణా; నీవున్ = నీ వొక్కడవేనా; రాజవె = రాజువా ఏమి; ధరకున్ = భూమిపైన.

భావము:

రాజీవలోచనాల నల్లనయ్యా! రాజుల మర్యాదలంటే ఏమో నీకు తెలిసినట్లు లేదు. బలవంతుడై నట్లు ప్రవర్తిస్తున్నావు. మేము అబలలము మా వలువలు మాకు ఇయ్యకున్నావు. మేము నందరాజుకు ఈ విషయం చెప్తాము. నీవేమైనా ఈ దేశానికి రాజువా, ఏమిటి?”