పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-794-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంచి ఫలంబులు హరిచే
నించి కరాలంబనముల నెగడుచు నిదె క్రీ
డించెద, రంగన! చూడుము
చెంచెతలం బింఛ పత్ర చేలాంచితలన్.

టీకా:

మంచి = చక్కటి; ఫలంబులున్ = పండ్లను; హరి = కృష్ణుని; చేన్ = చేతి యందు; నించి = నిండించి; కర = చేతులను; ఆలంబనములన్ = ఊతమిచ్చుటలుతో; నెగడుచున్ = అతిశయించుచు; ఇదె = ఇదిగో; క్రీడించెదరు = వినోదించుచున్నారు; అంగన = ఇంతి; చూడుము = చూడుము; చెంచెతలన్ = చెంచుస్త్రీలు; పింఛ = నెమలి పింఛములను; పత్ర = ఆకులను; చేల = వస్త్రములచే; అంచితలన్ = ధరించినవారిని.

భావము:

అందాల బొమ్మా! చూడు. ఆ బోయపడతులను. నెమలి ఈకల గుత్తులు ఆకులూ కోకలుగా ధరించి, ఎంతో మురుపు గొల్పుతున్నారు. వారు మధురమైన మంచి మంచి మాగిన పండ్లు గోవిందుడికి ఇచ్చే నెపంతో, అతని చేతిలో చేయ్యేసి ఆనందంతో అడుతున్నారు.