పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-786-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిరిచరమిథునము లోలిం
రికింపఁగఁ గృష్ణపాదద్మాంకితమై
సురాజు నగరికంటెనుఁ
రుణీ! బృందావనంబు ద్దయునొప్పెన్.

టీకా:

గిరిచర = గిరిజనులు; మిథునములు = దంపతులు; ఓలిన్ = వరుసగా, అదేపనిగా; పరికింపన్ = చూచుచుండగా; కృష్ణ = కృష్ణుని; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మములుపెట్టిన; అంకితము = గుర్తులు కలది; ఐ = అయ్యి; సురరాజునగరి = అమరావతి {సురరాజునగరి - సురరాజు (ఇంద్రుని) నగరి (పట్టణము), అమరావతి}; కంటెను = కంటె; తరుణీ = యువతీ {తరుణి - తరుణ వయస్కురాలు, స్త్రీ}; బృందావనంబు = బృందావనము; తద్దయున్ = అధికముగా; ఒప్పెన్ = చక్కగా ఉన్నది.

భావము:

ఓ అంగనా! కృష్ణుడి పద్మాల వంటి అడుగుల ముద్రల చిన్నెలతో కూడిన ఈ బృందావనం అమరావతి కంటే మిక్కిలి అందంగా భాసిస్తున్నది. కొండజాతి జంటలు ఈ సౌభాగ్యాన్ని అదేపనిగా చూస్తున్నారు.