పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-772-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"శ్రణోదంచితకర్ణికారమునతో స్వర్ణాభ చేలంబుతో
తంసాయిత కేకిపింఛమునతో నంభోజ దామంబుతో
స్వశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచు
న్నువిదా! మాధవుఁ డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే?

టీకా:

శ్రవణ = చెవి యందు; ఉదంచిత = మిక్కిలి చక్కగా ఉంచబడిన; కర్ణికారమున్ = కొండగోగిపువ్వు; తోన్ = తోటి; స్వర్ణ = బంగారము; ఆభ = ప్రభ గల; చేలంబు = వస్త్రము; తోన్ = తోటి; అవతంసాయిత = సిగబంతిగా కూర్చబడిన; కేకి = నెమలి; పింఛమున్ = పింఛము, కుంచము; తోన్ = తోటి; అంభోజ = పద్మముల; దామంబు = దండ; తోన్ = తోటి; స్వవశుండు = స్వతంత్రుడు; ఐ = అయ్యి; మధుర = తియ్యనైన; అధర = పెదవులస్పర్శ అనెడి; అమృతము = అమృతము; చేన్ = చేత; వంశంబున్ = మురళిని; పూరించుచున్ = ఊదుతు; ఉవిదా = వనితా; మాధవుడు = కృష్ణుడు {మాధవుడు - మాధవి ప్రియుడు, కృష్ణుడు}; ఆల = ఆవుల; వెంటన్ = వెంబడిని; వనము = అడవి; అందున్ = లో; ఒప్పారెడిన్ = చక్కగాఉన్నాడు; చూచితే = చూచితివా.

భావము:

"సఖీ! మన కృష్ణుడు చూసావా? చెవిలో కొండగోగి పువ్వు అలంకరించుకొన్నాడు. పసిడి వన్నె పట్టు వస్త్రం కట్టుకున్నాడు. శిరోజాలందు నెమలిపింఛం ధరించాడు. మెడలో పద్మాల దండ వేసుకున్నాడు. పరవశత్వంతో వేణువు నందు తియ్యని అధరామృతం పూరించుతు, అడవిలో ఆలమందలను మేపుతు ఎంత చక్కగా ఉన్నాడో చూడవే చూడు!