పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వర్షాగమ విహారంబు

  •  
  •  
  •  

10.1-762-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వమోహనమైన వేణు నినాదంబు-
రసగంభీర గర్జనముగాఁగ
హనీయ నిర్మల మందహాసద్యుతి-
లిత సౌదామనీ తిక గాఁగఁ
లచుట్టు బాగుగఁ నరు పింఛపుదండ-
శైలభేదను శరానము గాఁగఁ
రుణా కటాక్షవీక్షణ సుధావర్షంబు-
లిలధారా ప్రవర్షంబు గాఁగఁ

10.1-762.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాడ నేతెంచు గోపాలన మునీంద్ర
చాతకంబుల దురవస్థఁ క్కఁ జేసి
కృష్ణమేఘంబు బహుతరకీర్తి నొప్పె
విమల బృందావనాకాశవీధి యందు.

టీకా:

విశ్వ = లోకములను; మోహనము = మోహింపజేయునది; ఐన = అయినట్టి; వేణు = మురళీ; నినాదంబు = రవము; సరస = నవరసభరితమైన {నవరసములు - 1శృంగారము 2హాస్యము 3కరుణము 4వీరము 5రౌద్రము 6భయానకము 7భీభత్సము 8అద్భుతము 9శాంతము}; గంభీర = గంభీరమైన; గర్జనము = ఉఱుమువంటిది; కాగన్ = అగునట్లుగా; మహనీయ = గొప్పదైన; నిర్మల = స్వచ్ఛమైన; మందహాస = చిరినవ్వుల; ద్యుతి = కాంతి; లలిత = మనోజ్ఞమైన; సౌదామనీ = మెరుపు; లతిక = తీగ; కాగన్ = అగునట్లుగా; తల = శిరస్సు; చుట్టు = చుట్టూర, వలగొని; బాగుగన్ = చక్కగా; తనరు = అతిశయించునట్టి; పింఛపు = నెమలిపింఛము; దండ = మాల; శైలభేదనుశరాసనము = ఇంద్రధనుస్సు {శైలభేదనుశరాసనము - శైలభేదను (పర్వతములను కొట్టెడివాని, ఇంద్రుని) శరాసనము (విల్లు), ఇంద్రధనుస్సు}; కాగన్ = అగునట్లుగా; కరుణా = దయతోకూడిన; కటా = కడ; అక్ష = కన్నుల; వీక్షణ = చూపులు అనెడి; సుధా = అమృతపు; వర్షంబు = జల్లులు; సలిల = నీటి; ధారా = ధారలుగల; ప్రవర్షంబు = మంచివాన; కాగన్ = అగుచుండగ.
జాడన్ = అనుసరించి; ఏతెంచు = వచ్చెడి; గోపాలజన = గొల్లవాళ్ళు; ముని = ఋషి; ఇంద్ర = శ్రేష్ఠులు అనెడి; చాతకంబుల = చాతకపక్షుల, వానకోకిల; దురవస్థన్ = బాధలను; చక్కన్ = బాగు; చేసి = చేసి; కృష్ణ = కృష్ణుడు అనెడి; మేఘంబు = మేఘము; బహుతర = మిక్కిలిఅధికమైన {బహు - బహుతరము - బహుతమము}; కీర్తిన్ = కీర్తితో; ఒప్పెన్ = ఒప్పెను; విమల = స్వచ్ఛమైన; బృందావన = బృందావనము అనెడి; ఆకాశ = ఆకాశపు; వీధి = దారి; అందున్ = లో.

భావము:

నిర్మలమైన బృందావనం అనే వినువీధిలో శ్రీకృష్ణుడనే మేఘం మిక్కిలి విఖ్యాతంగా విహరించింది. భువనాలను సమ్మోహపరచే వేణుగానమే ఆ నీలమేఘానికి రసవంతమైన గంభీరమైన గర్జన అయింది. ఉదాత్తమూ స్వచ్ఛమూ అయిన దరహాస శోభయే మెరుగారు మెరుపుతీగ అయింది. తలచుట్టున చక్కగా విలసిల్లే నెమలిపింఛ కలాపమే ఇంద్రచాపం అయింది. కరుణాపూరితమైన కడగంటి చూపుల నుండి ప్రసరించే అమృతవర్షమే నీటి జల్లులు వార్చే వాన అయింది. ఇలా సంచరించిన ఆ శ్రీకృష్ణజీమూతం, తన్ను అనుసరించే గోపాలురు, మునీంద్రులు అనే చాతకపక్షుల తాపాలను రూపుమాపింది.