పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : దావాగ్ని తాగుట

  •  
  •  
  •  

10.1-743-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధర గభీర రవమున
ళినదళాక్షుండు దమ్ము నామాంకములం
బిలిచిన విని ప్రతిఘోషణ
ములు జేయుచుఁ బసులు దిరిగె ముదమున నధిపా!

టీకా:

జలధర = మేఘము వంటి; గభీర = గంభీరమైన; రవమునన్ = ధ్వనితో; నళినదళాక్షుడు = శ్రీకృష్ణుడు; తమ్ము = వాటిని; నామ = పేర్లు అనెడి; అంకములన్ = గురుతులతో; పిలిచినన్ = పిలువగా; విని = విని; ప్రతిఘోషణములున్ = మారుపలుకటకై అరచుట; చేయుచున్ = చేస్తు; పసులు = పశువులు; తిరిగెన్ = వెనుదిరిగెను; ముదమునన్ = సంతోషముతో; అదిపా = రాజా.

భావము:

మేఘగర్జనవలె గంభీరమైన కంఠస్వరంతో శ్రీకృష్ణుడు గోవులను పేరు పేరున పిలిచాడు. అలా పిలవగానే ఆ ధేనువులు మిక్కిలి సంతోషంతో “అంబా” అని మారు పలుకుతూ మరలి వచ్చాయి