పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : దావాగ్ని తాగుట

  •  
  •  
  •  

10.1-742-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గోపాలకు లందఱుం బసుల కుయ్యాలించి కౌమార కే
ళీ గాఢత్వము మాని గోఖురరదాళిచ్ఛిన్న ఘాసంబుతో
బాగై యున్న పథంబునం జని దవాన్నంబు గాకుండ వే
వేగన్ గోగణమున్ మరల్చి రటవీవీధిన్ జవం బొప్పఁగన్.

టీకా:

ఆ = ఆ యొక్క; గోపాలకులు = గోపకులు; అందఱున్ = ఎల్లరు; పసుల = పశువుల; కుయ్ = మొఱ, అరుపులను; ఆలించి = విని; కౌమార = పిల్లల; కేళీ = ఆట లందు; గాఢత్వమున్ = ఆసక్తిని; మాని = విడిచిపెట్టి; గో = ఆవుల; ఖుర = గిట్టల; రద = దంతములచేత; ఛిన్న = నలిగిపోయిన; ఘాసంబు = గడ్డి; తోన్ = తోటి; బాగు = చక్కగా; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; పథంబునన్ = దారిని; చని = వెళ్ళి; దవ = కార్చిచ్చుచేత; ఆపన్నంబు = ఆపదలో పడినవి; కాకుండ = కాకుండగా; వేవేగన్ = మిక్కిలి వేగముగా; గో = పశువుల; గణమున్ = సమూహమును; మరల్చి = మరలించిరి; అటవీ = అడవి; వీధిన్ = దారమ్మట; జవంబు = వడి; ఒప్పగన్ = కలుగునట్లుగా.

భావము:

ఆ యాదవబాలలు పశువుల ఘోష విన్నారు. పిల్లలు ఆటల మీది దృష్టి చాలించారు. ఆవుల గిట్టలచే నలిగి, వాటి దంతాలచే తునిగి ఉన్న గుర్తులను ఆనవాలు పట్టారు. అవి వెళ్ళిన దారిలో వాళ్ళు వేగంగా వెళ్ళారు. అలా వెళ్ళి, మంటలపాలు కాకుండా ఆ అడవిదారి నుంచి తమ గోవులను మరలించారు.