పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ప్రలంబాసుర వధ

  •  
  •  
  •  

10.1-728-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాముని సహజన్ముఁడు
రా మ్మని వానిఁ జీరి రాకం బోకన్
గారాము చేసి మెల్లన
పోరామి యొనర్చెఁ బిదపఁ బొరిగొనుకొఱకున్.

టీకా:

ఆ = ఆ; రామునిసహజన్ముడు = కృష్ణుడు {రాముని సహజన్ముడు - బలరాముని యొక్క సోదరుడు, కృష్ణుడు}; రారమ్ము = తొందరగారా {రాముడు - శ్రు:: రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని: ఇతి రామ పదేనాసౌ పరబ్రహ్మాభియతే, పరమానందము నిచ్చెడి పరబ్రహ్మ}; అని = అని; వానిన్ = అతనిని; చీరి = పిలిచి; రాకంబోకన్ = ఇటునటు తిరుగునప్పుడు; గారాము = గారాబము; చేసి = చేసి; మెల్లనన్ = మెల్లిగా; పోరామి = చెలిమి; ఒనర్చెన్ = చేసెను; పిదపన్ = తరువాత; పొరిగొను = చంపుట; కొఱకున్ = కోసము.

భావము:

బలరాముడి తోబుట్టువైన కృష్ణుడు ప్రలంబాసురుని హతమార్చేందుకు ఒక పన్నాగం పన్నాడు. ఆ దానవుణ్ణి చెంతకు రమ్మని ప్రియంగా పిలిచి రాకపోకలతో వానిలో నెమ్మదిగా చెలిమి పెంపొందించుకున్నాడు.