పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రోహిణి బలభద్రుని కనుట

  •  
  •  
  •  

10.1-71.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర
డత వాటిల్లె శత్రులు డను పడఁగ;
న్ను రుచియయ్యెఁ బగతురు న్ను చొరఁగ;
వెలఁది యుదరంబులో హరి వృద్ధిఁబొంద.

టీకా:

విమతుల = కంస చాణూరాదుల {విమతులు - శత్రువులు, కంసాదులు}; మోములున్ = ముఖములు; వెలవెలబాఱంగ = కాంతివిహీనములుకాగ; విమలాస్య = స్త్రీ {విమలాస్య - తేటయైన అస్య (మోముగలామె), సుందరి}; మోము = ముఖము; వెల్వెలక = కాంతివిహీనత్వము; పాఱెన్ = పోయినది; మలయు = వ్యాపించుచున్న; వైరుల = శత్రువుల యొక్క; కీర్తి = యశస్సు; మాసి = కాంతిచెడి; నల్లనన్ = నల్లగా, నశించినది; కాగన్ = అయిపోగా; నాతి = స్త్రీ; చూచుకములు = స్తనాగ్రములు; నల్లనన్ = నల్లగా; అయ్యెన్ = అయినవి; దుష్ట = దుష్టుల యొక్క; ఆలయంబులన్ = ఆవాసములందు; ధూమ = పొగ; రేఖలు = చుట్టలు; పుట్టన్ = లేచుచుండగ; లేమ = స్త్రీ; ఆరునన్ = నూగారునందు; రోమ = వెంట్రుకల; లేఖ = వరుసలు; మెఱసెన్ = ప్రకాశించినవి; అరి = శత్రువుల యొక్క; మానసముల్ = మనసుల; కున్ = కు; ఆహారవాంఛలున్ = ఆకళ్ళు; తప్పన్ = లేకపోతుండగా; వనజాక్షి = స్త్రీ {వనజాక్షి - తామరలవంటి కన్నులుగలామె, స్త్రీ}; కిన్ = కి; ఆహార = తిన; వాంఛ = బుద్ధి; తప్పెన్ = కాకపోతుండెను.
శ్రమమున్ = బడలికలు; సంధిల్లెన్ = కలిగెను; రిపుల్ = శత్రువుల; కున్ = కు; శ్రమమున్ = బడలిక; కదురన్ = కలుగుతుండగ; జడత = బుద్ధిమాంధ్యము; వాటిల్లెన్ = సంభవించినది; శత్రులు = శత్రువులు; జడను = స్తబ్దత్వము; పడగన్ = కలుగగా; మన్ను = మట్టిపై; రుచి = ఇష్టము; అయ్యెన్ = కలిగెను; పగతురు = శత్రువులు; మన్ను = మట్టిలో; చొరగన్ = కలసిపోవుటకు; వెలది = స్త్రీ; ఉదరంబున్ = కడుపు; లోన్ = అందు; హరి = విష్ణుమూర్తి; వృద్ధిపొందెన్ = పెరిగెను.

భావము:

దేవకీదేవికి గర్భవతులైన స్తీలకు ఉండే లక్షణాలు కనిపించసాగాయి. స్వచ్ఛమైన ఆమె ముఖము తెల్లపడుతుండగా, దుర్మార్గుల ముఖాలు వెలవెలపోడం మొదలయింది. ఆమె చనుమొనలు నల్లపడుతుండగా, శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడడం ప్రారంభమైంది. ఆమె పొత్తికడుపుపై నూగారు మెరుస్తుండగా, దుష్టుల ఇండ్లలో అపశకునాలైన ధూమరేఖలు పుట్టాయి. ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతుండగా, శత్రువులకు బెంగతో ఆహారం హితవు అవటం మానివేసింది. ఆమెకు బద్ధకము కలుగుతూంటే, శత్రువులకు తెలియని అలసట మొదలైంది. శత్రువులు మట్టికరచే స్థితి వస్తూ ఉన్నట్లు, ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువ అయింది. ఇలా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధిచెందసాగాడు.