పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రోహిణి బలభద్రుని కనుట

  •  
  •  
  •  

10.1-67-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుదేవుఁ డంతఁ దన యం దఖిలాత్మక మాత్మ భూతముం
బానరేఖయున్ భువనద్రమునై వెలుఁగొందుచున్న ల
క్ష్మీవిభు తేజ మచ్చుపడఁ జేర్చినఁ దాల్చి నవీనకాంతితో
దేకి యొప్పెఁ బూర్వయగు దిక్సతి చంద్రునిఁ దాల్చు కైవడిన్."

టీకా:

ఆ = ఆ; వసుదేవుడు = వసుదేవుడు; అంత = అంతట; తన = అతని; అందున్ = శరీరములోపల; అఖిల = సమస్తము నందు; ఆత్మకమున్ = ఆత్మ ఐనది; ఆత్మభూతమున్ = పరమాత్మ ఐనది; పావనరేఖయున్ = నిత్యపవిత్రమైనది; భువన = సర్వలోకములకు; భద్రమున్ = శుభకరము ఐనది; ఐ = అయ్యి; వెలుగొందుచున్న = ప్రకాశించుచున్న; లక్ష్మీవిభు = విష్ణుమూర్తి యొక్క; తేజమున్ = వీర్యమున్; అచ్చుపడన్ = అచ్చొత్తినట్లేర్పడగా; చేర్చినన్ = ప్రవేశపెట్టగా; తాల్చి = ధరించి; నవీన = సరికొత్త; కాంతి = తేజస్సు; తోన్ = తోటి; దేవకి = దేవకీదేవి; ఒప్పెన్ = చక్కగా ఉండెను; పూర్వ = తూర్పుది; అగు = ఐన; దిక్ = దిక్కు అనెడి; సతి = ఇల్లాలు; చంద్రునినన్ = చంద్రుడిని; తాల్చు = ధరించెడి; కైవడిన్ = విధముగ.

భావము:

అలా తనలో విష్ణుతేజం ప్రవేశించిన వసుదేవుడు, ఆ తేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశపెట్టాడు. ఆ విష్ణుతేజస్సు సృష్టి అంతా నిండి ఉండేది. అన్నిటికి ఆత్మ అయినది. లోకాలను పునీతం చేయగలది. లోకాలు అన్నిటికి క్షేమం చేకూర్చేది. లక్ష్మీపతి అయిన విష్ణువుని యొక్క తేజస్సు అది. ఆ తేజస్సు చక్కగా తనలో ప్రవేశించడంతో, దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పుదిక్కు అనే స్తీ చంద్రోదయానికి ముందు చంద్రునికాంతితో నిండిపోయినట్లు, దేవకీదేవి దేదీప్యమానంగా ప్రకాశించింది.”