పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గ్రీష్మఋతు వర్ణనము

  •  
  •  
  •  

10.1-726-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాక్షుండును రాముఁడున్ నటనముల్ల్పంగ గోపాల మూ
ర్తుతో వారలఁ గొల్చు నిర్జరులు సంతోషించి, వేణుస్వనం
బులుగావించుచుఁ గొమ్ములూదుచు శిరంబుల్ద్రిప్పుచుం బాడుచున్
నొప్పన్ వినుతించి రప్పుడు నటుల్ ర్ణించు చందంబునన్.

టీకా:

జలజాక్షుండును = పద్మాక్షుడు, కృష్ణుడు; రాముడున్ = బలరాముడు; నటనముల్ = నృత్యములు; సల్పంగన్ = చేయుచుండగా; గోపాల = గొల్లవాళ్ళ; మూర్తుల్ = రూపముల; తోన్ = తోటి; వారలన్ = వారిని; కొల్చు = సేవించెడి; నిర్జరులున్ = దేవతలు {నిర్జరులు - జర (ముసలితనము లేనివారు), దేవతలు}; సంతోషించి = ఆనందించి; వేణు = పిల్లనగ్రోవి; స్వనంబులు = రవములు; కావించుచున్ = ఊదుతు; కొమ్ములున్ = కొమ్ముబూరాలు; ఊదుచున్ = ఊదుతు; శిరంబుల్ = తలలు; త్రిప్పుచున్ = ఆడించుచు; పాడుచున్ = పాటలు పాడుతు; వలనొప్పన్ = అందగించునట్లుగ; వినుతించిరి = స్తోత్రములు చేసిరి; అప్పుడు = ఆ సమయము నందు; నటుల్ = నాటకులు; వర్ణించు = వర్ణించెడి; చందంబునన్ = విధముగ.

భావము:

బలరామకృష్ణులు నాట్యాలు చేస్తుంటే, వారి చుట్టూ గోపాలకులుగా ఉంటూ ఉన్న దేవతలు సంతోషించేవారు. వేణుగానాలు చేస్తూ, కొమ్ముబూరలు ఊదుతూ, తలలు తిప్పుతూ, పాటలు పాడుతూ, చక్కగా స్తోత్రాలు చేసేవారు. నటులు ఏవిధంగా నటనలు చేస్తూ, వర్ణనలు చేస్తుంటారో, అలాగే వీరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు.