పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళియుని పూర్వకథ

  •  
  •  
  •  

10.1-712-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నిన్నా యుగ్ర భుజంగమంబు గఱవన్ నీ వాపదం బొందుచున్
న్నేమంటి తనూజ! యోడవు గదా నా కూన! నా తండ్రి! రా
న్నా" యంచు శిరంబు మూర్కొని నిజాంకాగ్రంబుపై నిల్పుచున్
న్నీ రొల్కఁగఁ గౌగలించెఁ దనయున్ గారాముతోఁ దల్లి దాన్.

టీకా:

నిన్నున్ = నిన్ను; ఆ = ఆ యొక్క; ఉగ్ర = భయంకరమైన; భుజంగమంబు = పాము; కఱవన్ = కాటువేయగా; నీవున్ = నీవు; ఆపదన్ = ప్రమాదమును; పొందుచున్ = చెందుతు; నన్నున్ = నన్ను; ఏమి = ఏమి; అంటి = అడిగితివి; తనూజ = పుత్రుడా {తనూజుడు - తనువున జనించినవాడు, పుత్రుడు}; ఓడవు = భయపడలేదు; కదా = కదా; నా = నా; కూన = కొడుకా; నా = నా; తండ్రి = నాయనా; రావు = రమ్ము; అన్నా = అయ్యా; అంచున్ = అనుచు; శిరంబున్ = తలను; మూర్కొని = ముద్దాడి; నిజ = తన; అంకాగ్రంబు = ఒడి; పైన్ = మీద; నిల్పుచున్ = ఉంచుకొనుచు; కన్నీరు = కన్నీళ్ళు; ఒల్కగాన్ = కారుతుండగా; కౌగలించెన్ = ఆలింగనము చేసుకొనెను; తనయున్ = పుత్రుని; గారాము = గారాబము; తోన్ = తోటి; తల్లి = తల్లి; తాన్ = తాను.

భావము:

యశోద కృష్ణుణ్ణి తన ఒడిలో కూర్చుండ పెట్టుకుని “నా తండ్రీ! నా బాబూ! నిన్ను ఆ భయంకరమైన పాము కరుస్తూ ఉంటే, ఆపదలో చిక్కుపడినప్పుడు నా కోసం ఏమని విలపించావు నాయనా! బెంబేలు పడలేదు కదా” అంటూ కన్నీళ్ళతో గట్టిగా కౌగలించుకుని గారాబం చేసింది.