పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళిందుని విన్నపము

  •  
  •  
  •  

10.1-694-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా పుణ్య మేమి చెప్పుదు?
నీ పాదరజంబుఁ గంటి నే; సనకాదుల్
నీ పాదరజముఁ గోరుదు
రే దమం దున్ననైన నిఁక మేలు హరీ!"

టీకా:

నా = నా యొక్క; పుణ్యము = అదృష్టము; ఏమి = ఏమని; చెప్పుదు = చెప్పగలను; నీ = నీ యొక్క; పాద = కాలి; రజంబున్ = దుమ్మును; కంటిన్ = పొందితిని; నేన్ = నేను; సనకాదుల్ = పరమ ఋషులు {సనకాదులు - సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు}; నీ = నీ యొక్క; పాద = పాద; రజమున్ = ధూళిని; కోరుదురు = అపేక్షింతురు; ఏ = ఏ; పదము = స్థానము; అందున్ = లో; ఉన్ననైనన్ = ఉండినను; ఇకన్ = ఇకమీద; మేలు = మంచిదే; హరీ = కృష్ణా.

భావము:

శ్రీహరీ! సనకసనందాది దివ్యమునులు కూడ నీ పాద ధూళినే కావాలని కోరుకుంటారు. అలాంటి నీ పాదధూళి నేను పొందగలిగాను. నా పుణ్యం ఎంత గొప్పదో కదా? ఇంక నేను ఏ స్థితిలో ఉన్నా సరే నాకు శోభనమే.”