పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నాగకాంతలు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-685-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శాంతులు గాని తనువు
లీశా! యీ మూఢజాతు లీ సజ్జాతుల్
యీశాంత తనువులందుఁ బ్ర
కాశింతువు ధర్మహితముగా సుజనులలోన్.

టీకా:

ఈ = ఈ కనబడుచున్న; శాంతలుగాని = శాంతాది సద్గుణములు లేని; తనువులు = దేహధారి జీవులు; ఈశా = సర్వభోక్త, కృష్ణా; ఈ = ఈ కనబడుచున్న; మూఢ = నీ స్వరూప ఙ్ఞానములేని; జాతులు = జన్ములు; ఈ = ఈ కనబడుచున్న; సఙ్ఞాతుల్ = నీ స్వరూపఙ్ఞాన మున్నవి; ఈశాంత = ఈశ్వరుడే తుదిగా గల; తనువులు = దేహధారి జీవులు; అందున్ = అందు; ప్రకాశింతువు = వెలిగెదవు; ధర్మ = వర్ణాచారములకు; హితముగా = మేలు కలుగుటకు; సుజనుల = సజ్జనుల; లోన్ = అందు.

భావము:

ఈశ్వరా! నీవు శాంతి లేని వారిలోను, మూఢులైన వారి లోను, ఙ్ఞానులైన వారిలోను, ఈశ్వరుడే తుదగా జీవించే వారి లోను అందరిలోను ప్రకాశిస్తుంటావు. కాని ధర్మానికి మేలు చేయటం కోసం మంచి వాళ్ళలో తరచుగా ప్రకాశిస్తావు.