పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళియ మర్ధనము

  •  
  •  
  •  

10.1-672-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధంబులు వీడ భూషణము లాకంపింపఁ గౌఁదీవియల్
కుయుగ్మంబుల వ్రేగునం గదలఁ బైకొంగుల్ వడిన్ జాఱఁగాఁ
బ్రచురభ్రాంతిఁ గలంగి ముందట రుదద్బాలావళిం గొంచు స్రు
క్కుచు, భక్తింజని కాంచి రా గుణమణిన్ గోపాలచూడామణిన్.

టీకా:

కచబంధంబలు = జుట్టుముళ్ళు; వీడన్ = విడిపోతుండగ; భూషణములు = ఆభరణములు; ఆకంపింపన్ = అంతటను చలించగా; కౌన్ = నడుములు అనెడి; తీవియల్ = లతలు; కుచ = స్తనములు; యుగ్మంబులు = జంటల; వ్రేగునన్ = బరువునకు; కదలన్ = చలింపగా; పైకొంగులు = పైటకొంగులు; వడిన్ = వేగముచేత; జార = తొలగుచుండగా; ప్రచుర = అధికమైన; భ్రాంతిన్ = విభ్రమముచే, నివ్వెరపాటుచేత; కలంగి = కలత నొంది; ముందట = ఎదురుగా; రుదత్ = ఏడ్చుచున్న; బాల = పిల్లల; ఆవళిన్ = సమూహమును; కొంచున్ = తీసుకొనుచు; స్రుక్కుచు = నొచ్చుకొనుచు; భక్తిన్ = భక్తితో; చని = వెళ్ళి; కాంచిరి = దర్శనము చేసికొనిరి; గుణమణిన్ = మంచి గుణములు కలవానిని; గోపాల = యాదవులలో; చూడామణిన్ = శిరోమణివంటి వానిని.

భావము:

వారు వస్తున్న వేగానికి కాళియుని భార్యల కొప్పుముడులు జారిపోతున్నాయి. వారి ఆభరణాలు చెదిరిపోతున్నాయి. స్తనాల బరువుకు తీగలాంటి నడుములు అల్లాడిపోతున్నాయి. పైటకొంగులు జారి పోతున్నాయి. దిక్కు తోచని భ్రాంతితో కలవర పడిపోతున్నారు. గొల్లున ఏడుస్తున్న పిల్లలను ముందు పెట్టుకొని సుగుణాలశ్రేష్ఠుడు గోపాలశేఖరుడు అయిన కృష్ణుని చేరి వారు భక్తిపూర్వకంగా దర్శనం చేసుకొన్నారు.