పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళియ మర్ధనము

  •  
  •  
  •  

10.1-670-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు సర్వచరాచర
భూతేశుండైన పరమపురుషుఁడు సేవా
ప్రీతుఁడు శ్రీహరి యగు" నని
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా!

టీకా:

ఈతడు = ఇతను; సర్వ = సమస్తమైన; చర = చరించ గల; అచర = చరించ లేని; భూత = జీవులకు; ఈశుండు = ప్రభువు; ఐన = అగు; పరమపురుషుడు = పరమాత్మ; సేవా = భక్తుల యందు; ప్రీతుడు = ప్రీతి గలవాడు; శ్రీహరి = విష్ణుమూర్తి {హరి - సుషుప్తి మరియు ప్రళయ కాలములందు సర్వమును తన యందు లయము చేసుకొని సుఖరూపమున నుండువాడు, విష్ణువు}; అగును = అగును; అని = అని; భీతిన్ = భయముతో; శరణంబు = శరణు; ఒందెన్ = చొచ్చెను; బిట్టు = మిక్కిలి; అలసి = అలసిపోయి; నృపా = రాజా.

భావము:

రాజా! విష్ణుమూర్తి సమస్త చరాచర జీవులకు ప్రభువు, పరమ పురుషుడు, భక్తితో సేవిస్తే సంతోషించేవాడు. ఈ పిల్లవాడు ఆ శ్రీహరే అయ్యి ఉంటాడు.” అనుకున్నాడు కాళియుడు. మిక్కిలి భయంతో, అలసటతో అతడు కృష్ణుని శరణు కోరాడు.