పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలు విలపించుట

  •  
  •  
  •  

10.1-661-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుఁ గూర్చి యివ్విధంబున
నితలు బిడ్డలును దారు వాపోయెడి ఘో
నివాసులఁ గని కృష్ణుఁడు
నుజుని క్రియ నొక ముహూర్తమాత్రము జరపెన్.

టీకా:

తన్నున్ = అతనిని; కూర్చి = గురించి; ఈ = ఈ; విధంబునన్ = రీతిని; వనితలు = స్త్రీలు; బిడ్డలును = పిల్లలు; తారు = వారు; వాపోయెడి = ఏడ్చుచున్న; ఘోష = పల్లె; నివాసులన్ = ప్రజలను; కని = చూసి; కృష్ణుడు = కృష్ణుడు; మనుజుని = మానవుని; క్రియన్ = వలె; ఒక = ఒకేఒక్క; ముహూర్త = ముహూర్తము కాలము; మాత్రము = మాత్రమే; జరపెన్ = గడిపెను.

భావము:

ఇలా తన గురించి పెళ్ళాం పిల్లలుతో పాటు తాము కూడా విలపిస్తున్న గోకులంలో నివసించే వాళ్ళందరిని చూసాడు. సామాన్య మానవుడు లాగ కొంచెంసేపు మౌనం వహించి ఊరకున్నాడు.