పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : విషకలిత కాళింది గనుగొనుట

  •  
  •  
  •  

10.1-636-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మానవేశ్వర! యొక్క డుఁగు కాళిందిలోఁ-
ల; దది యెప్పుడుఁ గాళియాహి
విషవహ్నిశిఖలచే వేచు చుండును; మీఁదఁ-
ఱతెంచినంతన క్షులైనఁ
డి మ్రగ్గు; నందుఁ దద్భంగశీకరయుక్త-
వనంబు సోఁకినఁ బ్రాణు లెవ్వి
యైన నప్పుడ చచ్చు; ట్టి యా మడుఁగులో-
నుదకంబు పొంగుచు నుడుకుచుండుఁ

10.1-636.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జూచి వెఱగంది కుజనుల స్రుక్కఁజేయ
వతరించిన బలువీరుఁ డాగ్రహించి
"భుజగవిషవహ్నిదోషంబుఁ బొలియఁజేసి
సుజలఁ గావించి యా నదిఁ జూతు" ననుచు.

టీకా:

మానవేశ్వరా = రాజా {మానవేశ్వరుడు - మానవులకు ప్రభువు, రాజు}; ఒక్క = ఒకానొక; మడుగు = మడుగు {మడుగు - ఏటిలో లోతైన నిడుపాటి ప్రాంతము, హ్రదము}; కాళింది = యమునానది; లోన్ = అందు; కలదు = ఉన్నది; అది = ఆ మడుగు; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; కాళియ = కాళియుడు అనెడి; అహి = పాము యొక్క; విష = విషపు; అగ్ని = అగ్ని; శిఖల = జ్వాలల; చేన్ = చేత; వేచుచుండును = తపించిపోతుండును; మీదన్ = పైన; పఱతెంచి = వెళ్ళిన; అంతనన్ = మాత్రముచేతనే; పక్షులు = పక్షులు; ఐనన్ = అయినను; పడి = పడిపోయి; మ్రగ్గును = చచ్చిపోవును; అందున్ = ఆ మడుగునందు; తత్ = ఆ మడుగు యొక్క; భంగ = అలల వలని; శీకర = తుపుంరులతో; యుక్త = కూడినట్టి; పవనంబు = గాలి; సోకినన్ = తగులగానే; ప్రాణులు = జంతువులు; ఎవ్వి = ఏవి; ఐనన్ = అయినను; అప్పుడ = అప్పుడే; చచ్చున్ = చనిపోవును; అట్టి = అటువంటి; ఆ = ఆ; మడుగు = మడుగు; లోన్ = అందలి; ఉదకంబు = నీరు; పొంగుచున్ = ఉబుకుచు; ఉడుకుచున్ = తెర్లుతు; ఉండున్ = ఉండును; చూచి = అది చూసి.
వెఱగంది = ఆశ్చర్యపడి; కుజనులన్ = దుష్టులను; స్రుక్కజేయ = అణచివేయుటకు; అవతరించిన = పుట్టినట్టి; బలువీరుడు = బలమైన శౌర్యము కలవాడు; ఆగ్రహించి = కోపించి; భుజగ = కాళియసర్పము యొక్క; విష = విషపు; వహ్ని = అగ్ని వలని; దోషంబున్ = కల్మషమును; పొలియజేసి = పోగొట్టి; సుజలన్ = మంచినీరు కలది; కావించి = చేసి; ఆ = ఆ యొక్క; నదిన్ = నదిని; చూతున్ = కాపాడెదను; అనుచున్ = అనుచు.

భావము:

“మహారాజా! యమునానదిలో మడుగు ఒకటి ఉంది. కాళియుడనే సర్పరాజు విషజ్వాలలతో అది ఎప్పుడు తుకతుకలాడుతు ఉంటుంది. దాని పై ఎగిరే పక్షులు కూడ ఆ విషపు గాలులు సోకి చచ్చి అందులో పడిపోతాయి. ఆ కాళిందిలోని అలలకి చెలరేగిన నీటితుంపరలు కలిసిన గాలి సోకితే చాలు ఏ జంతువైనా అప్పటికప్పుడు చచ్చి పడిపోవలసిందే. ఆ మడుగులోని జలాలు ఎప్పుడు కుతకుత పొంగుతు ఉడుకుతు ఉంటాయి. ఆ మడుగును చూచి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. దుర్మార్గులను అణచేయడానికి అవతరించిన ఆ మహావీరునికి బాగా కోపం వచ్చింది. ఈ నదిలోని పాము విషాగ్ని దోషం పోగొట్టి, నిర్మల జలాలతో నిండి ఉండే నదిగా చేస్తాను. అని నిశ్చయించుకొన్నాడు.