పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ధేనుకాసుర వధ

  •  
  •  
  •  

10.1-626-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధేనుకవనమున నమలిరి
మావు లావేళఁ దాఁటి మ్రాకుల ఫలముల్;
ధేనువులు మెసఁగెఁ గసవులు;
ధేనుకహరభక్తకామధేనువు గలుగన్.

టీకా:

ధేనుక = ధేనుకాసురుని యొక్క; వనమునన్ = తోట యందు; నమలిరి = తినిరి, భుజించిరి; మానవులు = మనుష్యులు; ఆవేళన్ = అప్పటి; దాటి = నుండి; తాటిమ్రాకుల = తాడిచెట్ల; ఫలముల్ = పండ్లను; ధేనువులు = ఆవులు; మెసగెన్ = మేసెను, తినెను; కసవులున్ = పచ్చికలను; ధేనుక = ధేనుకాసురుని; హర = సంహరించిన; భక్త = భక్తుల యెడ; కామధేనువు = కామధేనువు వంటివాడు; కలుగన్ = ఉండుటచేత.

భావము:

ఎన్నాళ్ళ తరువాతో ఆనాడు దేనుకవనంలో గోపకులు ఆ తాడిపండ్లు తనివితీరా తిన్నారు. ఆవులు వనంలోని పచ్చికలు కడుపునిండా మేసాయి. దేనుకాసురుడిని చంపిన స్వామి భక్తుల పాలిట కామదేనువై ఉండగా వారి కోరికలు తీరడం అదెంతపని.