పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు అత్మీయు డగుట

  •  
  •  
  •  

10.1-594-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘునిఁ జంపి కృష్ణుఁ డాప్తులు దానును
ల్ది గుడిచి జలజసంభవునకుఁ
జిద్విలాసమైన చెలువుఁ జూపిన కథఁ
దువ వినినఁ గోర్కి సంభవించు.

టీకా:

అఘుని = అఘాసురుని; చంపి = సంహరించి; కృష్ణుడు = శ్రీకృష్ణుడు; ఆప్తులున్ = తనకు కావలసినవారు; తానునున్ = అతను; చల్ది = చద్దన్నములు; కుడిచి = తిని; జలజసంభవున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; చిత్ = ప్రఙ్ఞాస్వరూపమైన తన; విలాసము = లీలావిలాసము; ఐన = అయినట్టి; చెలువున్ = చక్కదనమును; చూపిన = చూపినట్టి; కథన్ = వృత్తాంతమును; చదువన్ = చదువుటవలన; వినినన్ = వినుట వలన; కోర్కి = వారి యొక్క కోరిక; సంభవించు = తీరును.

భావము:

శ్రీ కృష్ణుడు అఘాసురుని సంహరించడం ఆప్తులైన గోపబాలుర తోకూడి చల్దిఅన్నం ఆరగించడం బ్రహ్మకు తానే అన్నిటి యందూ అన్ని రూపాలలో ఉండటం అనే తన లీలలు చూపడం మొదలుగా గల ఈ కధను ఎవరు చదివినా ఎవరు విన్నా వారు కోరిన కోరిక తీరుతుంది.”