పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు అత్మీయు డగుట

  •  
  •  
  •  

10.1-590-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కని మనిచి యెత్తి పెంచిన
నుజన్ములకంటె నందనయుం డా ఘో
నివాసులకు మనోరం
నుఁ డెట్లయ్యెను? బుధేంద్ర! ను నెఱిఁగింపన్."

టీకా:

కని = ప్రసవించి; మనిచి = పోషించి; ఎత్తి = ఎత్తుకొని; పెంచిన = పెద్దచేసిన; తనుజన్ముల = స్వంతపిల్లల; కంటెన్ = కంటెను; నంద = నందుని; తనయుండు = పుత్రుడు; ఆ = ఆ యొక్క; ఘోష = గొల్లపల్లె; నివాసుల్ = ప్రజల; కున్ = కు; మనోరంజనుడు = ఇష్టుడు {మనోరంజనుడు - మనసును రంజింప చేయువాడు, ఇష్టుడు}; బుధ = ఙ్ఞానులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; చనున్ = తగును; ఎఱిగింపన్ = తెలియజేయ.

భావము:

“ఓ శుక మునీంద్రా! గోకులం లోని వారికి తాము కని పెంచిన తమ బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమపాత్రుడు ఎలా అయ్యాడు? నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు ఇది వివరించడం నీకే సాధ్యపడుతుంది.”