పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మ పూర్ణిజేయుట

  •  
  •  
  •  

10.1-565-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చర మృగ భూసుర నర
కుముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపన్
జెలిమిని సుజనుల మనుపను
పోయఁగ రాదు నీ విధంబు లనంతా!

టీకా:

జలచర = మత్స్యకూర్మాది; మృగ = నరసింహాది; భూసుర = పరశురామాది; నర = రామాది; కులములన్ = వంశములలో; జన్మించితి = అవతరించితవి; ఈవు = నీవు; కుజనులన్ = దుష్టులను; చెఱుపన్ = సంహరించెడి; చెలిమిన్ = సుహృదముతో; సుజనులన్ = మంచివారిని; మనుపనున్ = కాపాడెడి; తలపోయగన్ = ఉహింప; రాదు = శక్యముకాదు; నీ = నీ యొక్క; విధంబులున్ = వర్తనవిధములను; అనంతా = కృష్ణా {అనంతుడు - అంతములేని (కాల ప్రదేశ భావముల పరిమితులకు మీరిన) వాడు, విష్ణువు}.

భావము:

ఓ అనంత కృష్ణా! నీవలనే నీ మార్గాలు కూడా అంతం లేనివి. నీవు దుర్మార్గులను శిక్షించడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ జలచరములుగా, మృగములుగా, బ్రాహ్మణులుగా, సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు ఈవిధంగా ఉంటాయని ఊహించడం అసాధ్యం కదా.