పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మ తర్కించుకొనుట

  •  
  •  
  •  

10.1-546-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుగులపైఁ బడు లేచున్
డుఁ గ్రమ్మఱఁ లేచు, నిట్లు క్తిన్ మును దాఁ
బొగనిన పెంపుఁ దలఁచుచు
దుడుకని మహిమాబ్ధి నజుఁడు దుడు కడఁచె నృపా!

టీకా:

అడుగుల = పాదముల; పైన్ = మీద; పడున్ = వాలిపడును; లేచున్ = పైకిలేచును; పడున్ = వాలిపడును; క్రమ్మఱన్ = మరల; లేచున్ = పైకిలేచును; ఇట్లు = ఈ విధముగ; భక్తిన్ = భక్తితో; మునున్ = ఇంతకుముందు; తాన్ = అతను; పొడగనిన = చూసినట్టి; పెంపున్ = అతిశయమును; తలచుచున్ = గుర్తుచేసుకొనుచు; దుడుకని = ఉధృతికలవాని (కృష్ణుని); మహిమ = ప్రభావము అనెడి; అబ్ధిన్ = సముద్రము నందు; అజుడు = బ్రహ్మదేవుడు; దుడుకు = ఉధృతిని (తన); అడచెన్ = అణచివేసెను; నృపా = రాజా.

భావము:

పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలపై అనేక సార్లు పడుతూ లేస్తూ ప్రణమిల్లాడు. భక్తిపరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలచుకుని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు.