పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మ తర్కించుకొనుట

  •  
  •  
  •  

10.1-538-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బాలురఁ గంటి నాచెయిది బాసినవారిని మున్ను వారి నేఁ
బోలఁగఁ జూచునంతటన భూరినిరర్గళదుర్గమప్రభా
జాముతోడఁ జూపులకుఁ జాలమిఁ దెచ్చుచు నున్నవార; లే
మూమొ మార్గమెయ్యదియొ? మోసము వచ్చెఁగదే విధాతకున్."

టీకా:

బాలురన్ = చిన్నపిల్లలను; కంటిన్ = చూసితిని; నా = నా యొక్క; చెయిది = కృత్యమున; కిన్ = కు; పాసిన = మీరిన; వారిని = వారిని; మున్ను = ఇంతకుముందు; వారిన్ = వాళ్ళను; నేన్ = నేను; పోలగన్ = సరిగా, పోల్చుకొన; చూచున్ = చూసెడి; అంతన = అప్పటికి, సరికి; భూరి = అత్యధికమైన; నిరర్గళ = అడ్డములేని; దుర్గమ = పొందరాని; ప్రభా = కాంతుల; జాలము = సమూహముల; తోడన్ = తోటి; చూపుల్ = చూచుటకు; చాలమి = అశక్తతను; తెచ్చుచున్న = కలిగించుచున్నట్టి; వారలు = వారు; ఏ = ఏమిటి; మూలమొ = కారణమో ఏమో; మార్గము = దారితెన్ను, చేయదగ్గది; ఎయ్యదియొ = ఏదో ఏమిటో; మోసమువచ్చెన్ = మోసము వచ్చినది; కదే = కదా; విధాతకున్ = బ్రహ్మత్వమునకు.

భావము:

“నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందు నుంచీ చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారు. ఆ తేజస్సు మహా ప్రవాహం లాగ చూపులతో నైనా సమీపించడానికి వీలుకాకుండా ఉంది. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలటం లేదు. దీనికి అంతటికి మూలకారణం ఏమిటి? ఇప్పుడు నేనేమిటి చేయడం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడను నాకే మోసం వచ్చింది కదా.”