పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బలరాము డన్న రూ పెరుగుట

  •  
  •  
  •  

10.1-528-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని మున్ను ముగ్ధుఁ డయ్యును
యందుల దివ్యదృష్టిఁ ప్పక బుద్ధిన్
చెలికాండ్రను గ్రేపుల
జాక్షుం డనుచుఁ జూచె సుధాధీశా!

టీకా:

అని = అని; మున్ను = ముందు; ముగ్ధుడు = పరవశుడు; అయ్యును = అయినప్పటికిని; తన = అతని; అందులన్ = లోని; దివ్యదృష్టిన్ = దివ్యదృష్టితో; తప్పక = సరిగా; బుద్ధిన్ = మనసు నందు; తన = తన యొక్క; చెలికాండ్రను = స్నేహితులను; క్రేపులన్ = దూడలను; వనజాక్షుండ = కృష్ణుడే {వనజాక్షుడు - పద్మాక్షుడు, కృష్ణుడు}; అనుచున్ = అనుచు; చూచెన్ = గ్రహించెను; వసుధాధీశ = రాజా {వసుధాధీశుడు - వసుధ (భూమి)కి అధీశుడు (ప్రభువు), రాజు}.

భావము:

బలరాముడు ఇలా ఆలోచించి ఇంతవరకూ మోహంచెంది ఉన్నప్పటికీ, ఇప్పుడు దివ్యదృష్టితో శ్రద్ధగా చూసాడు. తన స్నేహితులు లేగదూడలు అన్నీ కృష్ణుడే అని గ్రహించాడు.