పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సురలు పూలు గురియించుట

  •  
  •  
  •  

10.1-490-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి యోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె; "న ట్లఘాసురు మొగంబువలనం గడచి చనిన లేఁగల గోపకుమారులం బ్రతికించి వారును దానునుం జని చని.

టీకా:

అని = అని; పలికి = చెప్పి; యోగ = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; రాజేంద్రున్ = మహారాజున; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను; అట్లు = అలా; అఘాసురుని = అఘాసురుని; మొగంబు = నోటి; వలనన్ = నుండి; కడచిచనిన = బయటపడిన; లేగలన్ = దూడలను; గోప = యాదవుల; కుమారులన్ = బాలురను; బ్రతికించి = కాపాడి; వారునున్ = వారు; తానునున్ = అతను; చనిచని = శ్రీఘ్రముగా వెళ్ళి.

భావము:

ఇలా పలికి శుకయోగి పరీక్షుత్తుతో ఇంకా ఇలా చెప్పాడు “అలా కృష్ణుడు అఘాసురుడి నోట్లోకి పోయిన లేగలను గోపకుమారులను వాడి బారి నుంచి బ్రతికించి, వారితో కలిసి ముందుకు సాగిపోయాడు