పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సురలు పూలు గురియించుట

  •  
  •  
  •  

10.1-485-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదవసరంబున, సురలు కుసుమ వర్షంబులు గురియించిరి; రంభాదు లాడిరి; గంధర్వాదులు పాడిరి; మేఘంబులు మృదంగంబుల భంగి ఘోషించె; సిద్ధ గణంబులు జయజయ భాషణంబులు భాషించి; రంత.

టీకా:

తదవసరంబునన్ = ఆసమయమున; సురలు = దేవతలు; కుసుమ = పూల; వర్షంబులున్ = వానలు; కురియించిరి = కురిపించిరి; రంభాదులు = అప్సరసలు {రంభాదులు - రంభమున్నగువారు, ఏకత్రిశంతి యప్సరసలు }; ఆడిరి = నాట్యములు చేసిరి; గంధర్వ = గంధర్వులు; ఆదులు = మున్నగువారు; పాడిరి = పాటలుపాడిరి; మేఘంబులున్ = మేఘములు; మృదంగముల = మద్దెలల; భంగిన్ = వలె; ఘోషించెన్ = మోగినవి; సిద్ధ = సిద్ధుల; గణంబులు = సమూహములు; జయజయ = జయము జయము అనెడి; భాషణంబులు = ధ్వానములు; భాషించిరి = చేసిరి; అంత = అప్పుడు.

భావము:

అప్పుడు, దేవతలు పూలవర్షం కురిపించారు; రంభ మొదలైన అప్సరసలు నాట్యాలు చేసారు; గంధర్వులు గానాలు చేసారు; మేఘాలు మృదంగాలవలె ధ్వనించాయి; సిద్ధులు కృష్ణునికి జయజయధ్వానాలు పలికారు.