పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : అఘాసుర వధ

  •  
  •  
  •  

10.1-464-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అరు లమృతపానంబున
రిన వా రయ్యు నే నిశాటుని పంచ
త్వమునకు నెదుళ్ళు చూతురు
ము నమ్మక యట్టి యఘుఁడు ర్పోద్ధతుఁడై.

టీకా:

అమరులు = దేవతలు; అమృత = అమృతమును; పానంబున్ = తాగుట; అమరిన = చక్కగా కలగిన; వారు = వారు; అయ్యున్ = అయినప్పటికిని; ఏ = ఏ ఒక్క; నిశాటునిన్ = రాక్షసుని {నిశాటుడు - నిశ (రాత్రి) చరించువాడు, రాక్షసుడు}; పంచత్వంబున్ = చావున {పంచత్వము - పంచభూతములకు తిరిగి చెందుట, మరణము}; కున్ = కు; ఎదుళ్ళు = ఎదురుచూచుటలు; చూతురున్ = చూచెదరో; తము = తమ శక్తిసామర్ధ్యములను; నమ్మక = నమ్మలేక; అట్టి = అటువంటి; అఘుడు = అఘాసురుడు; దర్ప = గర్వము; ఉద్ధతుడు = అధికముగా కలవాడు; ఐ = అయ్యి.

భావము:

“ఇలా ఉండగా కొంతకాలానికి అఘాసరుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. దేవతలు అమృతం త్రాగి మరణం లేని వారైనా, ఈ అఘాసురుడి పేరు చెబితే బెదిరి పోతారు. ఈ అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని, వారు ఎదురుచేస్తూ ఉంటారు.