పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బకాసుర వధ

  •  
  •  
  •  

10.1-443-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్ల పనులు మాని యేకాగ్రచిత్తుఁ డై
మౌనివృత్తి నితర తము విడిచి
నములోన నిలిచి నజాక్షుపై దృష్టి
చేర్చి బకుఁడు తపసి చెలువుఁ దాల్చె.

టీకా:

ఎల్ల = అన్ని; పనులు = వ్యాపారములు; మాని = విసర్జించి; ఏకాగ్రచిత్తుడు = మనసు లగ్నమైన వాడు; ఐ = అయ్యి; మౌని = మునుల; వృత్తిన్ = వలె; ఇతర = అన్యమైన; మతము = ఆలోచనలు; విడిచి = వదలిపెట్టి; వనము = కొలను; లోనన్ = అందు; నిలిచి = నిలబడి; వనజాక్షున్ = కృష్ణుని {వనజాక్షుడు - వనజము (పద్మము)లవంటి అక్షుడు (కన్నులు గలవాడు), కృష్ణుడు}; పైన్ = మీద; దృష్టి = మనసును; చేర్చి = లగ్నము చేసి; బకుడు = బకాసురుడు; తపసి = తపసుల; చెలువున్ = రీతిని; తాల్చెన్ = ధరించెను.

భావము:

ఆ కొంగ అన్ని పనులు మానేసి ఏకాగ్రచిత్తంతో అడవిలోని కొలనులో మునిలాగా నిలబడి ఉన్నది. ఇంక ఏ విధమైన కోరికలు లేవు ఒక్క కృష్ణుడి మీదనే దృష్టి అంతా కేంద్రీకరించింది. కృష్ణుడిని శత్రుత్వంతో చంపజూచే ఆ ప్రయత్నంలో మహర్షులు చేయదగిన తపస్సు దానికి సిద్ధించింది.