పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వత్సాసుర వధ

  •  
  •  
  •  

10.1-439-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్సముల పగిది జగముల
త్సలతన్ మనుపఁ జూచువాఁడై యుంటన్
త్సముల మేపు చుండియు
త్సాసురుఁ జంపె భక్తత్సలుఁ డధిపా!

టీకా:

వత్సములన్ = ఆవుదూడలను {వత్సము - ఒక సంవత్సరములోపు దూడ}; పగిదిన్ = వలెనే; జగములన్ = లోకములను; వత్సలతన్ = వాత్సల్యముతో; మనుపన్ = కాపాడవలెనని; చూచువాడు = పూనునట్టివాడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుటచే; వత్సములన్ = దూడలను; మేపుచుండియున్ = మేపుతున్నను; వత్సారున్ = వత్సుడు అనెడి రాక్షసుని; చంపెన్ = సంహరించెను; భక్తవత్సలుడు = శ్రీకృష్ణుడు {భక్త వత్సలుడు - భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు, విష్ణువు}; అధిపా = రాజా.

భావము:

పరీక్షిన్మహారాజా! ఆవు తన దూడను రక్షించు నట్లు ఈ లోకాలు అన్నింటిని వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు. కనుక భక్తులను కన్నబిడ్డలవలె కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుణ్ణి చంపివేసాడు.