పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బృందావనము బోవతలచుట

  •  
  •  
  •  

10.1-424-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వు గల దిరవు పసులకు
దద్రి నదీ మహీజ తికావళిఁ బెం
పెసఁగును, గాపురమునకును
బొసఁగును బృందావనంబు పొదఁ డచ్చటికిన్."

టీకా:

కసవు = గడ్డి; కలది = ఉన్నట్టి; ఇరవు = చోటు; పసులకు = పశువులకు; లసత్ = చక్కటి, ప్రకాశవంతమైన; అద్రి = కొండలు; నదీ = నదులు; మహీజ = వృక్షములు; లతికా = తీగల; ఆవళిన్ = సమూహములతో; పెంపు = సమృద్ధితో; ఎసగున్ = అతిశయించును; కాపురమున్ = సంసారములు చేయుట; కును = కు; పొసగును = తగి ఉండును; బృందావనంబు = బృందావనము; పొదడు = పదండి పోదాము; అచ్చటి = అక్కడ; కిన్ = కు.

భావము:

అక్కడ బృందావనం అనే ప్రదేశం ఉంది. అక్కడ పశువులకు మేత పుష్కలంగా లభిస్తుంది. అక్కడ విహరించడానికి చక్కని పర్వతాలు నదులూ చెట్లు తీగెలు కలిగి ఎంతో అందంగా ఉంటుంది. అక్కడకి వెళ్ళిపోదాం పదండి.”