పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కపటబాల లీలలు

  •  
  •  
  •  

10.1-421-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భిక్షులు వచ్చెద రేడ్చిన;
భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్
శిక్షించెద"; రని చెప్పిన
భిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లు నృపా!

టీకా:

భిక్షులు = యాచకులు, అడుక్కొనెడివారు; వచ్చెదరు = వస్తారు; ఏడ్చినన్ = ఏడ్చినచో; భిక్షాపాత్రమునన్ = భిక్షాపాత్ర యందు; వైచి = వేసుకొని; బెగడించి = బెదిరించి, జడిపించి; నినున్ = నిన్ను; శిక్షించెదరు = దండింతురు; అని = అని; చెప్పినన్ = చెప్పినచో; భిక్షులన్ = బిచ్చగాళ్ళను; కని = చూసి; తల్లిన్ = తల్లిని; కనియున్ = కనుగొనినను; భీతిల్లె = భయపడెను; నృపా = రాజా.

భావము:

ఓ మహారాజా! యశోదాదేవి “ఏడవుకురా కన్నా! ఇదిగో బిచ్చగాళ్లు వస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళు నిన్ను జోలెలో వేసుకొని తీసుకు వెళ్ళి కొడతారు జాగ్రత్త” అని బెదిరించింది. చిన్నికిట్టయ్య వాకిట్లోకి వచ్చిన బిచ్చగాళ్లను చూసి, తల్లి వైపు భయపడుతూ చూసాడు.