పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గుహ్యకులు కృష్ణుని పొగడుట

  •  
  •  
  •  

10.1-416-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నందుని కొమరుఁడు వినుఁ డీ
సందున మును దూఱి ఱోలు రి యడ్డముగా
ముంటి కీడ్చిన మద్దులు
గ్రందుకొనం గూలె; జనులఁ గంటి మిరువురన్."

టీకా:

నందుని = నందుడి యొక్క; కొమరుడ = పుత్రుడు; వినుడు = వినండి; ఈ = ఇక్కడి; సందునన్ = నడిమి ఇరుకు మార్గము; మునున్ = ముందుగా; దూఱి = దూరి వెళ్ళి; ఱోలున్ = ఱోలు; సరియడ్డము = బాగ అడ్డము; కాన్ = పడగా; ముందఱ = ఎదర; కిన్ = కు; ఈడ్చినన్ = లాగగా; మద్దులు = మద్దిచెట్లు; క్రందుకొనన్ = పెద్ద చప్పుడు చేస్తూ; కూలెన్ = పడిపోయెను; జనులన్ = వ్యక్తులను; కంటిమి = చూసితిమి; ఇరువురన్ = ఇద్దరను (2).

భావము:

“నందుని కొడుకు అయినట్టి కృష్ణుడు ఈ చెట్ల సందులలోనుంచి ముందు తాను దూరాడు. వెనుక నున్న ఱోలు ఏమో అడ్డంతిరిగింది. గట్టిగా లాగాడు. అంతే! మద్ది చెట్లు ఫెళఫెళ మంటూ కూలిపోయాయి. ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు.”