పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గుహ్యకులు కృష్ణుని పొగడుట

  •  
  •  
  •  

10.1-407-ఉపేం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వివాక్యంబులు ప్ప వయ్యెన్;
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
పంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రన్నులం జేయుము క్తమిత్రా!

టీకా:

తపస్వి = ఋషి యొక్క; వాక్యంబులు = మాటలు; తప్పవు = వట్టిపోనివి; అయ్యెన్ = అయినవి; నెపంబునన్ = వంక వలన (నారదశాపం); కంటిమి = చూడగలిగితిమి; నిన్నున్ = నిన్ను; చూడన్ = చూచుటతోడనే; తపంబులు = మా తపస్సులు; ఒప్పెన్ = సాఫల్యము లాయెను; మమున్ = మమ్ములను; తావకీయ = నీకు; ప్రపన్నులన్ = శరణాగతులనుగా; చేయుము = చేయుము; భక్తమిత్ర = శ్రీకృష్ణ {భక్తమిత్రుడు - భక్తులకు ఆప్తుడు, విష్ణువు}.

భావము:

ఓ కృష్ణపరమాత్మా! నారదమునీంద్రుల వారు మహాతపస్వి. వారి మాటలు వట్టిపోకుండా అలాగే జరిగింది. వారి శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్నేళ్ళ నుండీ నిన్ను చూడాలనే తపించాము. ఇప్పటికి ఫలించింది. నీవు భక్తులకు పరమ మిత్రుడవు. మమ్ములను నీ శరణాగత భక్తులుగా మన్నించి అనుగ్రహించు.