పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గుహ్యకులు కృష్ణుని పొగడుట

  •  
  •  
  •  

10.1-406-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భునములు చేయఁ గావఁగ
తీర్ణుఁడ వైతి కాదె ఖిలేశ్వర! యో
గిరేణ్య! విశ్వమంగళ!
విసన్నుత! వాసుదేవ! ల్యాణనిధీ!

టీకా:

భువనములు = లోకములను; చేయగన్ = సృష్టించుటకు; కావగన్ = కాపాడుటకు; అవతీర్ణుడవు = అవతరించుచుండవాడవు; ఐతి = అయినావు; కాదె = కదా; అఖిలేశ్వర = సర్వేశ్వరుడా {అఖిలేశ్వరుడు - అఖిల – పంచకృత్యము లన్నిటిని (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహ) చేయుటకు ఈశ్వరుడు (కర్త)}; యోగి = యోగులచే; వరేణ్య = వరింపబడెడివాడా; విశ్వ = భువనములకు; మంగళ = శుభప్రదుడా; కవి = కవులచే, సృష్టికర్తలచే; సన్నుతా = కీర్తింపబడెడివాడా; వాసుదేవ = శ్రీకృష్ణా {వాసుదేవుడు - లోకములన్ని తన యందు తను లోకము లన్నిటి యందు వసించు వాడు, విష్ణువు}; కల్యాణ = శోభనములకు; నిధీ = నిధి వంటివాడా.

భావము:

ఓ వాసుదేవా! శ్రీకృష్ణా! ఈ లోకాలను అన్నింటినీ సృష్టించడానికీ, రక్షించడానికీ అవతరించావు గదా! నీవు ఈ సమస్తానికి ఈశ్వరుడవు. యోగులు అందరూ నిన్ను దైవంగా వరించారు. నీవు ఈ సృష్టికి శుభాలు చేకూర్చుతావు. సృష్టిలోని శుభాలు అన్నీ నీ నుండే పుడుతూ ఉన్నాయి.