పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గుహ్యకులు కృష్ణుని పొగడుట

  •  
  •  
  •  

10.1-404-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బాలుఁడవె నీవు? పరుఁడ వ
నాలంబుఁడ వధికయోగి వాద్యుడవు తను
స్థూలాకృతి యగు విశ్వము
నీ లీలారూప మండ్రు నిపుణులు కృష్ణా!

టీకా:

బాలుడవె = సాధారణ పిల్లాడివా, కాదు; నీవున్ = నీవు; పరుడవు = పరాత్పరుడవు {పరుడు - పరా పశ్యంతి మధ్యమ వైఖరీ అనెడి వాక్కులకు అందనివాడవు}; అనాలంబుడవు = ఆలంబనల కతీతుడవు; అధిక = అధికమైన; యోగివి = వైభవములు కలవాడవు; ఆద్యుడవు = విశ్వ కారణభూతుడవు; తను = సూక్ష్మ; స్థూల = బహుళమైన; ఆకృతి = జగత్తులు కలది; అగు = ఐన; విశ్వము = భువనము; నీ = నీ యొక్క; లీలా = క్రీడా; రూపము = స్వరూపము; అండ్రు = అనెదరు; నిపుణులు = బాగా తెలిసినవారు; కృష్ణా = శ్రీకృష్ణా.

భావము:

"శ్రీకృష్ణా! నీవు సామాన్య మానవ బాలుడవా? కాదు కాదు. పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కరలేని వాడవు. మహాయోగివి. అన్నిటికీ మొదటివాడవు. అత్యంత సూక్ష్మం నుండి అత్యంత స్థూలం వరకూ ఈ విశ్వమంతా నీ రూపమే అని వివేకులు అంటారు.